Thursday, April 25, 2024

Breaking: మునుగోడులో కారుకు జై కొట్టిన కామ్రేడ్స్ .. టీఆర్ఎస్ కు సీపీఐ మద్దతు

మునుగోడులో జరుగనున్న ఎన్నికల్లో సీపీఐ పార్టీ టీఆర్ఎస్ కు మద్దతు ఇస్తోందని ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… అయితే ఇది మునుగోడుకే పరిమితం కాదని.. భవిష్యత్ లో కూడా టీఆర్ఎస్ తో కలిసి పనిచేస్తామన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించేందుకు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. మునుగోడు బహిరంగ సభకు రావాలని సీఎం కేసీఆర్ ఆహ్వానించారన్నారు. 2018ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇబ్బంది పెట్టిందన్నారు. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా జాతీయ పార్టీ తీర్మానం ఉందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement