Wednesday, April 24, 2024

సిఎం కెసిఆర్ సార‌ధ్యంలోనే వైశ్యుల‌కు స‌ముచిత స్థానం..

హ‌లియా . సీఎం కేసీఆర్‌ ఆర్యవైశ్యులకు సముచిత స్థానం కల్పిస్తున్నారని రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ బొల్లం సంపత్‌కుమార్‌ అన్నారు. సాగర్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన అవసరముందని అన్నారు. సాగర్‌ నియోజక వర్గంలో ని హలియా పట్టణంలో జరిగిన ఆర్యవైశ్యు ల ఆత్మీయ సమ్మేళనానికి రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ బొల్లం సంపత్‌కుమార్‌, తెలంగాణ పోలీస్‌ హౌసింగ్‌ కమిటి చైర్మన్‌ దామోదర్‌ గుప్త, తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌ గుప్త, ఇండస్ట్రియల్‌ కార్పోరేషన్‌ చైర్మన్‌ అమరవాది లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ బొల్లం సంపత్‌కుమార్‌ను ఆర్యవైశ్యులు ఘనంగా సన్మానించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం, రాజకీయ పార్టీలు కూడా ఆర్యవైశ్యులకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదని సంపత్‌కుమార్‌ తెలిపారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు అన్ని వర్గాలకు అందే విధంగా ఉన్నాయని తెలిపారు. సాగర్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌కు మద్దతుగా నిలిచి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement