Saturday, April 20, 2024

దేశానికి ద్రోహం చేస్తున్న బీజేపీ : మంత్రి జగదీష్‌ రెడ్డి

నల్లగొండ : దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతూ.. కేంద్రంలోని బీజేపీ పార్టీ దేశ ద్రోహానికి పాల్పడుతున్నది. అలాంటి పార్టీలో చేరి రాజగోపాల్ రెడ్డి చరిత్ర హీనుడిగా మిగిలిపోయడాని విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి ఫైర్‌ అయ్యారు. నాంపల్లి మండలం మల్లపు రాజు పల్లి గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవనం, పాఠశాల అదనపు గదులు, పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించి మాట్లాడారు. బీజేపీకి మునుగోడు ఉప ఎన్నికల్లో సరైన గుణపాఠం చెప్తామని స్పష్టం చేశారు. మునుగోడు లో గులాబీ పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఓటేసి గెలిపించిన మునుగోడు ప్రజలను వెన్నుపోటు పొడిచి, అమ్ముడు పోయిన రాజగోపాల్ రెడ్డి కి ఓటమి తప్పదన్నారు. మునుగోడు నియోజకవర్గంలో ఏ గ్రామానికి పోయిన ప్రజలు, కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలి వచ్చి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ, తక్కెళ్లపల్లి రవీందర్ రావు. మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకుడు విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement