Thursday, April 25, 2024

మిర్యాలగూడలో బస్తీ దవాఖాన.. ప్రారంభించిన మంత్రి హ‌రీష్ రావు

మంత్రి హ‌రీశ్ రావు నల్గొండ, సూర్యాపేట జిల్లాల ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. ఈ మేర‌కు పలు అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేయనున్నారు మంత్రి హరీశ్ రావు. కాగా మంత్రి హరీశ్ రావుకు వేములపల్లి వద్ద ఘన స్వాగతం పలికారు మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంపి బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే సైదిరెడ్డి, నోముల భగత్ ఎమ్మెల్సీ కోటిరెడ్డి ఇతర ప్రజాప్రతినిధులు..అనంత‌రం వేములపల్లి గ్రామ పంచాయతీని ప్రారంభించారు మంత్రి హరీశ్ రావు.అనంత‌రం మిర్యాలగూడలో బస్తీ దవాఖాన ప్రారంభించారు మంత్రి హరీశ్ రావు..ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంపి బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు భాస్కర్ రావు, నోముల భగత్ ఎమ్మెల్సీ కోటిరెడ్డి ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement