Thursday, March 28, 2024

కరోనా ఎఫెక్ట్‌ : యాదాద్రిలో ఆర్జిత సేవల నిలిపివేత

యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆర్జిత సేవలు 3 రోజులపాటు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. రేపటి నుంచి ఈ నెల 30 వరకు ఆర్జిత సేవలను నిలిపివేయనున్నట్లు శనివారం ఆలయ అధికారులు పేర్కొన్నారు. ఆలయంలో పలువురు ఉద్యోగులు, సిబ్బందికి కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణగా కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. భక్తులకు స్వామి లఘు దర్శనం మాత్రమే ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు ప్రతిఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు పాటించాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement