Thursday, April 25, 2024

గణేష్ నిమజ్జనంలో అపశ్రుతి.. ఒకరు మృతి

నల్గొండ జిల్లా చండూరు మండలం కస్తాల గ్రామంలో గణపతి నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. గ్రామంలో ప్రతిష్టించిన వినాయకుని నిమజ్జన శోభాయాత్ర గ్రామస్థులంతా కలిసి ఘనంగా నిర్వహించారు. అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామస్థులు కలిసి గ్రామ చెరువులో వినాయకుని నిమజ్జనం చేయబోయారు.

వినాయకుడిని నీళ్ళల్లోకి వదులుతుండగా గ్రామానికి చెందిన గోపిడి రాంరెడ్డి (45) ప్రమాదవశాత్తూ వినాయకునితో పాటు నీటిలో పడిపోయాడు. అందరూ చూస్తుండగానే నీట మునిగిన రాంరెడ్డి ఊపిరాడక మృతి చెందాడు. అనంతరం మృతదేహాన్ని చెరువులో నుంచి బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తరలించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement