Saturday, April 20, 2024

సాగ‌ర్ బ‌రిలో 41 మంది అభ్య‌ర్ధులు…..

నాగ‌ర్జున‌సాగ‌ర్ – నాగార్జునసాగ‌ర్ ఉప ఎన్నిక‌ల నామినేష‌న్ ల ఉప సంహ‌ర‌ణ గ‌డువు నేటితో ముగిసింది. బ‌రిలో మొత్తం 41 మంది మిగిలారు.. నామినేష‌న్ల్ ఉప‌సంహ‌ర‌ణ ఆఖ‌రి రోజైన నేడు మొత్తం 19 మంది త‌మ త‌మ నామినేష‌న్లు ఉప‌సంహ‌రించుకున్నారు.. దీంతో రంగంలో మిగిలిన 41 మంది అభ్య‌ర్థుల వివ‌రాల‌ను రిట‌ర్నింగ్ అధికారి ప్ర‌క‌టించారు.. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల బరిలో 41 మంది నిలిచారు. ఈ ఉప ఎన్నిక నామినేషన్ల పరిశీలన పూర్తయింది. మొత్తం 77 నామినేషన్లు దాఖలు కాగా, పలు కార ణాలతో 17 మంది నామినేషన్లు తిరస్కరించారు. బీజేపీ సాగర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి నివేదితారెడ్డి, ఆమ్‌ఆద్మీ పార్టీ అభ్యర్థి కుతుబుద్ధిన్‌లు తిరస్కరణ జాబితాలో ఉన్నారు. ఇక నేడు 19 మంది అభ్యర్థులు నామినేషన్స్ ఉపసంహరించుకున్నారు.  బిజెపి త‌రుపున డాక్ట‌ర్ ర‌వికుమార్ , కాంగ్రెస్ త‌రుపున కె జానారెడ్డి, టిఆర్ ఎస్ త‌రుపున భ‌గ‌త్. టిడిపి అభ్యర్ధి ప్ర‌ధాన పోటీ దారులుగా ఉన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement