Friday, March 29, 2024

న‌ల్గొండ‌లో ప్రారంభ‌మైన‌ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు..

న‌ల్గొం డ‌ : వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ఓట్ల‌ లెక్కింపు నల్లగొండలోని ఆర్జాలబావిలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో నేటి ఉద‌యం ప్రారంభమైంది… వరంగల్‌-ఖమ్మం-నల్గొండ నియోజకవర్గాల్లో 76.41శాతం పోలింగ్‌ నమోదైంది. అంటే మొత్తం 3,86,320 ఓట్లు పోల‌య్యాయి.. వాటిని లెక్కించేందుకు 800 మంది సిబ్బం దిని నియోగిస్తున్నారు.. వారంతా మూడు షిఫ్ట్ ల‌లో ఓట్ల‌ను లెక్కించ‌నున్నారు.. ముందుగా చెల్లని ఓట్లను గుర్తించను న్నారు. ప్రతీ రౌండ్‌లో 56వేల ఓట్లను లెక్కించ‌నున్నారు. అయితే అభ్యర్ధులు ఎక్కువ సంఖ్యలో పోటీలో ఉండటం, జంబో బ్యాలెట్‌ కావడంతో వాటిని విప్పి వేరు చేసేందుకే ఎక్కువ సమయం పట్టనుంది. ఒక్కో టేబుల్‌కు ఒక సూపర్‌వైజర్‌, ఇద్దరు సిబ్బంది, ఒక మైక్రో అబ్జర్వర్‌ ఉంటారు. మొదట చెల్లుబాటయ్యే ఓట్లను 25గా విభజించి కట్టలుగా క‌డుతున్నారు. ఈ తర్వాత ప్రాధాన్యతా క్రమంలో ఓట్లను లెక్కించనున్నారు. ఓట్ల లెక్కింపు భారీ ప్ర‌క్రియ కావ‌డంతో ట్రెండ్స్ ఈ రాత్రికి గాని తెలిసే అవ‌కాశం లేదు.. ఈ స్థానంలో టి ఆర్ ఎస్ అభ్య‌ర్ధిగా ప‌ల్లా రాజేశ్వ‌రారెడ్డి, బిజెపి అభ్య‌ర్ధిగా ప్రేమేందర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్య‌ర్ధిగా రాములు నాయ‌క్, , స్వ‌త్రంత్ర అభ్య‌ర్ధిగా కోదండ‌రాంతో పాటు మ‌రో 64 మంది రంగంలో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement