Tuesday, April 16, 2024

నాగార్జునసాగర్ పోలింగ్: ఓటేసిన నోముల భగత్..

నాగార్జునసాగర్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. జూనియర్ కాలేజీలో ఏజెంట్ రాకపోవడంతో కొద్దిసేపు పోలింగ్ నిలిచిపోగా, స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. అనంతరం అధికారులు స్పందించి చర్యలు తీసుకోవడంతో పోలింగ్ షురూ అయింది. అంతకుమించి నియోజకవర్గం అంతటా కూడా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు 53.3 శాతంగా నమోదైంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి ఉన్నారు. కాగా, టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నోముల భగత్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి ఇబ్రహీంపేటలోని ఓ పాఠశాలలో ఓటేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement