Friday, April 26, 2024

త‌డిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి : కాంగ్రెస్

ప్రజా చైతన్య యాత్రలో భాగంగా కల్లాల్లోకి కాంగ్రెస్ నాయకులు కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈరోజు తొగుట మండల కేంద్రంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి ల‌ ఆదేశాల మేరకు ప్రజా చైతన్య యాత్రలో భాగంగా మార్కెట్ కమిటీలోని వడ్లను పరిశీలించి, తడిసిన వడ్లను కూడా వెంటనే కొనుగోలు చేయాల‌ని డిమాండ్ చేశారు.

అలాగే మార్కెట్ యార్డ్ నుండి నిరసన ప్రదర్శనతో తహసిల్దార్ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గాంధారి నరేందర్ రెడ్డి, తొగుట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అధ్యక్షులు అక్కం స్వామి, మండల కిసాన్ సెల్ అధ్యక్షులు సిద్ది శ్రీనాకర్ రెడ్డి, టీపీసీసీ ఫిషర్ మెన్ రాష్ట్ర కార్యదర్శి రేపాక తిరుపతి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ముడీకే స్వామి యాదవ్, ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు జిడిపల్లి స్వామి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు లింగాల కృష్ణ, ఫిషర్ మెన్ మండలాధ్యక్షుడు రవీందర్, మండల ప్రధాన కార్యదర్శి చిక్కుడు ఉప్పలయ్య, తోగుట గ్రామ ఉపసర్పంచ్ పేర్ల బాలరాజు, గ్రామ కమిటీ అధ్యక్షులు, మండల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement