Friday, April 26, 2024

తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ని ఆద‌రించండి – సీత‌క్క‌

ములుగు మండలం లోని బండారు పల్లి గ్రామములో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు డిక్లరేషన్ రచ్చ బండ కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైయ్యారు కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క..
ఈ సందర్భంగా మాట్లాడుతూ ..తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీనీ ఆదరించండి అని, కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో రైతులకు కెసిఆర్ చేసింది ఏమి లేదని, ఎన్నికల సమయంలో ఏక కాలంలో రైతు రుణమాఫీ చేస్తా అని, పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇస్తా అని, రైతులకు ఎరువులు మరియు విత్తనాలు ఉచితంగా ఇస్తానని దొంగ హామీలు ఇచ్చి అధికారం లోకి వచ్చిన కెసిఆర్ గారు వరి వేస్తే ఉరి అనే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందని, రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దు ఏడ్చిన ఎవుసం బాగుపడ్డ చరిత్ర లేదని, ముఖ్య మంత్రి కెసిఆర్ మాయమాటలు నమ్మి మోసపోవద్దన్నారు..ఈ కార్యక్రమంలో టిపిసిసి అధికార ప్రతినిధి రవళి రెడ్డి..కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెళ్లి రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా,సహకార సంఘం మాజీ చైర్మన్ కునురు అశోక్ గౌడ్,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కుక్కల నాగరాజు..గ్రామ కమిటీ అధ్యక్షులు నెల్లుట్ల రాజన్న,మాజీ సర్పంచ్ కక్కెర్ల అశోక్, సర్పంచ్ఎండీ అహ్మద్ పాషా,గన్నేర్ల భాస్కర్..యూత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వంశీ కృష్ణ,మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శి ఎండీ ఆజ్జు నాగి రెడ్డి, రాం చంద్రు,బుషి గొండ రామస్వామి,నీలం సమ్మయ్య,సొక్కయ్య, బొత్తు దుర్గయ్య,కిరణ్, పెండెల భిక్ష పతి,యూత్ కాంగ్రెస్ నాయకులు కిషోర్, మురళి,.రాజు,వినయ్,రాజు,శివ,ప్రశాంత్, అనీల్,శ్రీను, తదితరులు
పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement