హైదరాబాద్ – హైదరాబాద్ 8వ నిజాం నవాబు ముఖరం ఝా బహదూర్ మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ముఖరం జా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ముఖరంజా నిజాం వారసుడిగా విద్యావైద్యా రంగాల్లో సేవలు అందించారని, పేదల కోసం కృషి చేశారని సీఎం కేసీఆర్ కొనియాడారు. కాగా, ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు. అంతేకాదు, ముఖరంజా భౌతికకాయం హైదరాబాదుకు చేరుకున్న తర్వాత ఆయన కుటుంబ సభ్యులతో చర్చించి అంత్యక్రియల స్థలాన్ని నిర్ణయించాలని ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్ కు సూచించారు. నిజాం నవాబు భర్కత్ అలీ ఖాన్ వల్షన్ ముకరం ఝా శనివారం రాత్రి టర్కీలోని ఇస్తాంబుల్లో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన చివరి కోరిక మేరకు హైదరాబాద్లో అసఫ్ జాహీ టూంబ్స్లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ముకరం ఝా పార్ధివదేహాన్ని ఈ నెల 17న టర్కీ నుంచి నగరానికి తీసుకురానున్నారు. అనంతరం ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం చౌమహల్లా ప్యాలెస్లో ఉంచనున్నారు. కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు అంత్యక్రియలను ప్రభుత్వ లాంచనాలతో నిర్వహించనుంచి ప్రభుత్వం.
Advertisement
తాజా వార్తలు
Advertisement