Saturday, April 20, 2024

Breaking: నిజామాబాద్ లో ఉద్రిక్తత.. నడిరోడ్డుపై బైఠాయించిన ఎంపీ అర్వింద్

పోలీసుల తీరుపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కోసం నందిపేట వెళ్తున్న క్రమంలో ఎంపీ అర్వింద్ ను ఆర్మూర్ మండలం ఆలూరు వద్ద టీఆర్ఎస్ నేతలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పసుపు బోర్డు ఎక్కడంటూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలు పోటాపోటీ ధర్నాలు చేశారు. ఈ క్రమంలోనే ఆర్మూర్ నుంచి నందిపేటకు వెళ్తున్న ఎంపీ అర్వింద్, బీజేపీ కార్యకర్తలను పోలీసులు మామాడిపల్లి చౌరస్తాలో అడ్డుకున్నారు.దీంతో పోలీసుల తీరుకు నిరసనగా బీజేపీ నేతలతో కలిసి అర్వింద్ రోడ్డుపై బైఠాయించారు. దీంతో పెర్కిట్ చౌరస్తాలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది.

ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ… ఎంపీ ల్యాడ్స్ నిధులతో నందిపేటలో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు వెళ్తుంటే టీఆర్ఎస్ నేతలు అడ్డుకోవడం దుర్మార్గమని అన్నారు. కేంద్రం ఇచ్చే నిధులతో అభివృద్ధి పనులు చేస్తుంటే టీఆర్ఎస్ ఓర్వలేకపోతోందని మండిపడ్డారు. కోవిడ్ నిబంధనల పేరుతో తమ దీక్షలు, పర్యటనలు అడ్డుకునే పోలీసులకు టీఆర్ఎస్ నేతలు చేసే పనులు కళ్లకు కనిపించడం లేదా? అని నిలదీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement