Saturday, April 20, 2024

ఈటలను ఓడించండి: హుజురాబాద్ ప్రజలకు మోత్కుపల్లి పిలుపు

దళిత బంధును అడ్డుకునేందుకు కొందరు కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. దళితులు బాగుపడితే బానిసలుగా ఉండరని భావిస్తున్నారని, అఖిలపక్షం దళిత బంధును స్వాగతించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్‌కు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని దళితులకు పిలుపు ఇచ్చారు. బీజేపీ నేత ఈటల రాజేందర్ అవినీతిపరుడని, పదవిని అడ్డం పెట్టుకుని 700 ఎకరాల భూమి సంపాదించారని ఆరోపించారు. 40 ఎకరాలు దళితుల అసైన్డ్ భూమని ఆయనే చెప్పారని, ఆ భూమిని వెంటనే వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈటలను ఎన్నికల నుంచి బహిష్కరించాలని చెప్పారు. ఉప ఎన్నికలో ఈటలను ఓడించాలని మోత్కుపల్లి పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement