Tuesday, April 16, 2024

నగరంలో మరిన్ని అభివృద్ధి పనులు .. మంత్రి గంగుల

కరీంనగర్ నగరంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపడుతున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ… డబుల్ బెడ్ రూమ్ గృహాలను త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందించనున్నామన్నారు. స్మార్ట్ సిటీలో అభివృద్ధి పనులకు ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని, నగరంలో ఐలాండ్ లతో పాటు ఇతర పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ కర్నాల్, నగర మేయర్ సునీల్ రావుతో పాటు అధికారులు, కార్పొరేటర్లతో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement