Friday, April 19, 2024

ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు అందుకున్న ఎమ్మెల్సీలు మ‌హేంద‌ర్ రెడ్డి, శంభీపూర్ రాజు

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా లోకల్ బాడీ ఎమ్మెల్సీ లుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పట్నం మహేందర్ రెడ్డి, శంభీపూర్ రాజు ధృవీకరణ పత్రాలు అందుకున్నారు. ఈరోజు జిల్లా ఎన్నికల పరిశీలకులు చంపాలాల్, జిల్లా క‌లెక్ట‌ర్, జిల్లా ఎన్నికల అధికారి అమోయ్ కుమార్ ల చేతుల మీదుగా ధృవీకరణ పత్రం అందుకున్నారు. ఈ ఎమ్మెల్సీ స్థానాల‌కు పోటీలో ఎవరూ లేకపోవడంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మ‌హేంద‌ర్ రెడ్డి, శంభీపూర్ రాజులు ఏకగ్రీవంగా ఎన్నిక‌య్యారు. ఈకార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద, జిల్లా అద‌న‌పు క‌లెక్ట‌ర్ ప్ర‌తీక్ జైన్ లు ఉన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement