Thursday, April 18, 2024

భౌరంపేట్ శ్రీ అయ్యప్పస్వామి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ

దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బౌరంపేట్ గ్రామంలోని శ్రీ శ్రీ శ్రీ భౌరంపేట్ ఆశ్రిత వత్సల అయ్యప్పస్వామి ఆలయ మూడవ వార్షికోత్సవ మహోత్సవంలో భాగంగా అరుణ్ గురుస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన పూజ కార్యక్రమానికి ఈ రోజు ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు ముఖ్య అతిధులుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ… అయ్యప్పస్వామి ఆలయం మూడవ వార్షికోత్సవం వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఆ స్వామి ఆశీస్సులు అందరి పైన ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా గ్రంధాలయ ఛైర్మన్ నాగరాజు యాదవ్, పాక్స్ చైర్మన్ మిద్దుల బాల్ రెడ్డి, కౌన్సిలర్లు శంబిపూర్ కృష్ణ ,శ్రీనివాస్ రెడ్డి, శంకర్ నాయక్, కార్పొరేటర్లు మంత్రి సత్యనారాయణ, జగన్, ఆగం పాండు, చిట్ల దివాకర్, మాజీ జడ్పీటీసీ వైస్ చైర్మన్ బొంగునూరి ప్రభాకర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, సీనియర్ నాయకులు జిమ్మి దేవేందర్, పోలీస్ గోవింద్ రెడ్డి, ధర్మ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, మురళి యాదవ్, కస్తూరి బాలరాజు, దర్శన్ రెడ్డి, ఆకుల యాదయ్య, నాయకులు గోపాల్, మల్లేష్, భక్తులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement