Thursday, March 28, 2024

సింగ‌రేణిలో కొవిడ్ నియంత్ర‌ణ‌కు ఎమ్మెల్సీ కవిత ప్ర‌త్యేక చొర‌వ‌

హైదరాబాద్‌, : సింగరేణిలో కోవిడ్‌ మహమ్మారి కట్టడికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. సింగరేణి యాజ మాన్యంతో, ప్రభుత్వ యంత్రాంగంతో సమన్వయం చేస్తూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యం లో కార్మికులు, ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణకు పలు చర్యలు తీసుకుంటున్నారు. కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు మొదలు వైద్య సేవలు, క్వారంటైన్‌ సెంటర్ల ఏర్పాటు, ఐసోలేషన్‌ వార్డుల ఏర్పాటు, వ్యాక్సినేషన్‌ వరకు అన్ని దశల్లో కరోనా కట్టడికి కృషిచేస్తున్నారు. సింగ రేణి సీఎండీ శ్రీధర్‌ ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తూ, మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటుండగా, కార్మికుల ఆరోగ్యం.. మెరుగైన చర్యల కోసం కవిత పలుమార్లు యాజమాన్యానికి, టిబిజికెఎస్‌ నేతలకు సూచనలు అందించారు. రూ.3.16 కోట్లతో లక్షా పదివేల రాపిడ్‌ టెస్ట్‌ కిట్ల కొను గోలు, భారీ ఎత్తున పరీక్షలు, 25వేల మందికి వ్యాక్సి నేషన్‌, 1,400 బెడ్‌లతో ప్రత్యేక వార్డుల ఏర్పాటు చేయగా, సింగరేణి వ్యాప్తంగా ఉన్న కరోనా ప్రత్యేక వార్డుల్లోనూ, ఐసోలేషన్‌ సెంటర్లలో అందిస్తున్న వైద్య సేవలతో 9,650 మంది పూర్తిగా కోలుకున్నారు. సింగరేణిలో మొత్తం కార్మికుల సంఖ్య 44వేలు కాగా, ప్రస్తుతం యాక్టివ్‌ కేసులుగా ఉండి వైద్యం పొందు తున్న కార్మికుల సంఖ్య కేవలం 650 మాత్రమే నని, ప్రభుత్వ సహకారంతో సింగరేణి వ్యాప్తంగా ఇప్పటికే 27వేల మందికి వ్యాక్సినేషన్‌ కూడా పూర్తయిందని టిబిజికెస్‌ వర్గాలు తెలిపాయి. మరో 50వేల మందికి వ్యాక్సినేషన్‌ చేయడం కోసం వాటిని తయారీదారుల నుండే కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రయత్నిస్తోంది. కరోనా తీవ్రంగా ఉన్న వారిలో ఇప్ప టి వరకు 862 మందికి హైదరాబాద్‌ లోని కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో వైద్య సేవలకుగానూ సింగరేణి యాజ మాన్యం సుమారు రూ.38 కోట్లను వెచ్చించిందని, సింగరేణి వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న 673 బెడ్‌లకు అదనంగా రూ.43 లక్షలతో మరో 755 బెడ్‌లను ఏర్పా టు చేశారని టిబిజికెఎస్‌ నేతలు తెలిపా రు. సుమారు రూ.80 లక్షలతో వివిధ రకాల మందు లు, ఆక్సిజన్‌ మీటర్‌ లాంటి 18 రకాల వస్తువులుగల కిట్లను కొను గోలు చేసి హోం ఐసోలేషన్‌లో ఉన్న వారికి అందజేస్తు న్నారని, సింగరేణి వ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులకు అవసరమైన రెమిడిసివిర్‌ ఇంజెక్షన్లు, ఫెవి పెరావిర్‌ లాంటి మందులను 5.55 కోట్లతో సమకూర్చడం జరిగిందని, ఆక్సిజన్‌ కొరత లేకుండా చూసేందుకు రూ.3.60 కోట్ల వ్యయంతో ఐదుచోట్ల ఆక్సిజన్‌ ఉత్పత్తి కేంద్రాలు, రూ.1.18 కోట్లతో 370 ఆక్సిజన్‌ సిలిండర్ల ను కొనుగోలు చేశారని ప్రకటించారు. మృతి చెందిన ఉద్యోగులు 39 మంది ఒక్కొక్కరికి రూ.15 లక్షల ఎక్స్‌ గ్రేషియాను కూడా కంపెనీ చెల్లించిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement