Thursday, April 25, 2024

నిజామాబాద్ రేప్ కేస్: కవిత సీరియస్ కామెంట్

నిజామాబాద్ నగరంలో సంచలనం రేపిన యువతిపై అత్యాచారం ఘటనపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. యవతిపై అత్యాచార ఘటన చాలా బాధాకరం అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ఘటనలను ఏమాత్రం ఉపేక్షించదని స్పష్టం చేశారు. 24 గంటల్లో నిందితులను అరెస్ట్ చేసిన పోలీస్ శాఖ వారికి అభినందనలు తెలిపారు. సీఎం కేసీఆర్ అన్ని జిల్లాల్లో షీ టీంలను ఏర్పాటు చేసి, ఆడబిడ్డలకు భరోసానిస్తున్నారని తెలిపారు. మహిళలపై వివక్ష చూపినా, అఘాయిత్యాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం వెనకడుగు వేయదని స్పష్టం చేశారు. నిజామాబాద్ లో అత్యాచారానికి గురైన బాధితురాలికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున, వ్యక్తిగతంగానూ అన్ని రకాలుగా అండగా నిలుస్తామని కవిత హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: పోసాని ఇంటిపై రాళ్ల దాడి.. అసలేం జరిగింది?

Advertisement

తాజా వార్తలు

Advertisement