Wednesday, April 24, 2024

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వివేకానంద

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని 67 మంది సీఎం రిలీఫ్ ఫండ్ పథకం లబ్ధిదారులకు రూ.44,60,500ల‌ విలువ చేసే చెక్కులను ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించి ఈరోజు చింతల్ లోని తన కార్యాలయం వద్ద పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. నిరుపేదలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. పేదలకు కూడా కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందాలనే ఉద్ధేశ్యంతో సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ద్వారా సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు. పేదల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని నిధులైనా వెచ్చించేందుకు సిద్ధంగా ఉందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట్ డిప్యూటీ మేయర్ దన్ రాజ్ యాదవ్, కార్పొరేటర్లు కొలన్ వీరేందర్ రెడ్డి, సురేష్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ రంగారావు, నాయకులు దేవరకొండ శ్రీనివాస్, సునీల్ రెడ్డి, చందు ముదిరాజ్, సిద్దిక్, బాబు గౌడ్, పరుష శ్రీనివాస్ యాదవ్, సంధ్య రెడ్డి, మసూద్, ఇబ్రహీం నదీమ్ రాయ్, విజయ్ హరీష్, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement