Saturday, April 13, 2024

స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషిచేస్తాన‌న్న ఎమ్మెల్యే వివేకానంద్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని 28వ వార్డు చర్చ్ గాగిల్లాపూర్ 214 రాజీవ్ గాంధీ నగర్ బస్తీ వాసులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ను చింతల్ లోని తన కార్యాలయం వద్ద మున్సిపాలిటీ టీఆర్ఎస్ అధ్యక్షుడు సంజీవ రెడ్డి తో పాటు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ బస్తీలో మంచి నీటి పైపు లైన్లు, రేషన్ షాపు, అంగన్వాడీ కేంద్రం, మహిళా భవనం, రోడ్లు, డ్రైనేజీ, గౌసే పాక్ దస్తగిర్ చిల్లా దర్గా ప్రహరీ గోడ నిర్మాణం వంటి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే స్పందిస్తూ… వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. రాజీవ్ గాంధీ నగర్ బస్తీ వాసులకు ఇబ్బందులు లేకుండా అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం బస్తీలో మిగిలి ఉన్న మహిళా భవన్, దర్గా ప్రహరీ గోడ, రేషన్ షాపు వంటి ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బస్తీ వాసులు కరీమ, మురళి, గోవన్, హసీనా, లక్ష్మీ, భారతి, జహెర తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement