Thursday, March 28, 2024

స‌ర్కిల్ కార్యాల‌య భ‌వనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వివేకానంద్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని మున్సిపల్ కార్యాలయం వద్ద గాజులరామారం సర్కిల్ కార్యాలయ భవనంలో నూతనంగా నిర్మించిన రెండవ అంతస్తులో ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని జోనల్ కమిషనర్ మమత తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి, కార్పొరేటర్లు రావుల శేషగిరి రావు, కొలుకుల జగన్, బి.విజయ్ శేఖర్ గౌడ్, రశీదా మహ్మద్ రఫీ, మంత్రి సత్యనారాయణావు, మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, 100 మంది పాల్గొన్నారు.
అనంతరం 128 చింతల్ డివిజన్ పరిధిలోని ఎన్ ఎల్ బీ నగర్ మెయిన్ రోడ్డులో ఓం శ్రీ మహిళా శక్తి ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన శక్తి ప్రొడక్ట్స్ మెయిన్ యూనిట్ ను ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ జోనల్ కమిషనర్ మమత తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ రషిదా బేగం, 100 మంది పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement