Thursday, April 25, 2024

అయ్యప్ప స్వామి మహా పడిపూజలో ఎమ్మెల్యే వివేకానంద్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, రంగారెడ్డి నగర్ 127వ‌ డివిజన్ పరిధిలోని వెంకట్రామ్ రెడ్డి నగర్ శ్రీ సీతారామాంజనేయ విశ్వేశ్వర స్వామి దేవస్థానం వద్ద అయ్యప్ప స్వాములు ఏర్పాటు చేసిన మహా పడిపూజా మహోత్సవంలో ఈరోజు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, స్థానిక కార్పొరేటర్ బి.విజయ్ శేఖర్ గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… స్వామి వారి పడిపూజా మహోత్సవంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ప్రజలపై అయ్యప్ప స్వామి వారి కృప తప్పక ఉంటుందని పేర్కొన్నారు. కరోనా పూర్తిగా అంతమై ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని అయ్యప్ప స్వామి వారిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ సతీష్ గట్టోజీ, రామకృష్ణ, రఘునాథ్ రెడ్డి, రాజిరెడ్డి, మహదేవ్, శ్రీనివాస్, సత్తయ్య, స్థానిక నాయకులు భాస్కర్ రెడ్డి, కార్తిక్ గౌడ్, రహీమ్, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement