Wednesday, March 27, 2024

కాలనీల అభివృద్ధిలో ఎల్లప్పుడూ ముందుంటాన‌న్న ఎమ్మెల్యే వివేకానంద్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని డీపీ కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు బుధవారం ఎమ్మెల్యే వివేకానంద్ ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అసోసియేషన్ నూతనంగా ఎన్నికైన సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… నియోజకవర్గంలోని ప్రతి కాలనీలో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. సంక్షేమ సంఘం సభ్యులంతా ఐకమత్యంగా ఉంటూ ఎటువంటి సమస్యలున్నా.. తన దృష్టికి తీసుకురావాలని, అప్పుడే సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ చంద్ర శేఖర్ గౌడ్, వైస్ ప్రెసిడెంట్ షేక్ ఖాజా మీయ, జెనరల్ సెక్రెటరీ రంగ స్వామి, ట్రెజరర్ పృథ్వి రాజ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ శ్రీనివాస్ రావు, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండిhttps://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement