Wednesday, April 17, 2024

బాసర మండల కేంద్రంలో పర్యటించిన ఎమ్మెల్యే విఠ‌ల్ రెడ్డి

నిర్మల్ జిల్లా బాసర పట్టణంలో ఈ రోజు ఎమ్మెల్యే జి.విఠ‌ల్ రెడ్డి పర్యటించి పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. బిరప్ప ఆలయ స్థలాన్ని ఎమ్మెల్యే స్థానిక నాయకులు,కురుమ సంఘ సబ్యలతో కలిసి పరిశీలించారు. కురుమ సంఘ భవనానికి నిధులు ఇస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. 3 లక్షల రూపాయలను శ్రీ కృష్ణ యాదవ సంఘ భవన నిర్మాణానికి ప్రొసీడింగ్ కాఫీని ఎమ్మెల్యే సంఘ అధ్యక్షుడు ప్రసాద్,సంఘ సబ్యులకు అందజేశారు. అంతకుముందు ఎమ్మెల్యే విఠ‌ల్ రెడ్డి శ్రీ కృష్ణ యాదవ సంఘ భవన నిర్మాణ భూమి పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విఠ‌ల్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాలకు పునర్ వైభవం కలిగించేందుకు అనేక రకాలుగా సహాయం అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మణ్ రావు,వైస్ ఎంపీపీ నర్సింగ్ రావు, జడ్పీటీసీ వసంత రమేష్, ఎంపిటిసి రమేష్, మాజీ పిఏసిఎస్ చైర్మెన్ రామారావు, బీఆర్ఎస్ కన్వీనర్ శ్యామ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సుధాకర్ రావు, పిఏసిఎస్ డైరెక్టర్ రమేష్ రావు, కో ఆప్షన్ మెంబర్ సయ్యద్ అలీ, మల్కాన్న యాదవ్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement