Friday, April 26, 2024

రోడ్డు ప్రమాద బాధితులకు ఎమ్మెల్యే రేఖా సాయం

టీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్ రోడ్డు ప్రమాద బాధితుల పట్ల మానవతా దృక్పథం ప్రదర్శించారు. ఎమ్మెల్యే రేఖా నాయక్ కడెం పర్యటన ముగించుకుని నిర్మల్ వెళుతుండగా.. ఖానాపూర్ మండలం తర్లపాడ్ గ్రామ శివార్లలో ఓ కారు చెట్టుకు ఢీకొని ప్రమాదానికి గురైనట్టు గమనించారు. వెంటనే తన వాహనాన్ని ఆపించారు. ప్రమాదంలో గాయపడిన వారిని పరిశీలించారు. వెంటనే తన సిబ్బంది సాయంతో వారిని తన కారులోకి చేర్చి.. అనంతరం ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement