Saturday, April 20, 2024

ఎమ్మెల్యే కొనుగోలు కేసు విచార‌ణ 27కి వాయిదా..

న్యూఢిల్లీ – ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సిబిఐ విచారణకు ఆదేశిస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై స్పందించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సిబిఐని నియంత్రించలేమని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. తదుపరి విచారణని ఈనెల 27వ తేదీకి వాయిదా వేసింది. అయితే విచారణ సమయంలో తెలంగాణ ప్రభుత్వం తరఫున దుష్యంత్ దవే వాద‌న‌లు వినిపిస్తూ. ఈ కేసులో ఆధారాలన్నీ బిజెపికి వ్యతిరేకంగా ఉన్నాయని, ఈ నేపథ్యంలో కేసును సిబిఐ కి ఎలా అప్పగిస్తారని వాదించారు. కేసు పై వాదించేందుకు త‌న‌కు మరింత సమయం కావాలని కోరారు. అయితే ధర్మాసనం మాత్రం సిబిఐని నియంత్రించలేమని అంటూ హైకోర్టు ఆదేశాల‌ను స‌మ‌ర్ధిస్తూ, కేసుని ఈనెల 27 కి వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement