Thursday, March 28, 2024

టూరిజం హబ్ గా ఖిలా వరంగల్: ఎమ్మెల్యే నన్నపునేని

టూరిజం హబ్ గా ఖిలా వరంగల్ ని నిలుపుతామని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఖిలా వరంగల్ తూర్పు కోటలోని హనుమాన్ సెంటర్ లో 3 కోట్లతో చేపడుతున్న అభివృద్ది పనులకు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ముఖ్యఅతిధిగా హాజరై శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రెండుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామని, ఆశీర్వదించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే నెల రోజుల్లో నియోజకవర్గంలో మరింత భారీగా నిధులు ఖర్చుపెట్టి అభివృద్ది చేస్తామన్నారు. గత పాలకులు ఈ నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేశారన్నారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి కేటీఆర్ నాయకత్వంలో నియోజకవర్గాన్ని అభివృద్దిలో దూసుకుపోయేలా చేస్తున్నామన్నారు. దళితబందుతో దళితుల్లోని పేదలను ఆదుకుంటున్నామని తెలిపారు. సొంత ఇంటి స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి ఇండ్లు అందజేయబోతున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement