Friday, March 29, 2024

మౌలిక సదుపాయాల కల్పనకు కృషి: ఎమ్మెల్యే దాసరి

ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కృషి చేస్తున్నామని పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని 21, 22 వ వార్డులో 1.40  కోట్ల రూపాయల తో నిర్మించే సిసి రోడ్లు డ్రైనేజీ పనులను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ గతంలో ఎన్నడూ గతం లో ఎన్నడూ  జరగనంత అభివృద్ధి 7 ఏళ్లలో చేసి చూపామన్నారు. జిల్లా కేంద్రంలో అంతర్గత రోడ్ల నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ దాసరి మమతా ప్రశాంత్ రెడ్డి, కమిషనర్ తిరుపతి తో పాటు కౌన్సిలర్లు, తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement