Thursday, April 25, 2024

దుండిగల్ మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తాన‌న్న ఎమ్మెల్యే కేపీ

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని 27వ వార్డు కౌన్సిలర్ శంకర్ నాయక్ ఈరోజు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ను పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజీ, చెత్త డంపింగ్ యార్డుకి రోడ్డు లేక తాండా పక్కనే డంప్ చేస్తున్నారని ఎమ్మెల్యే దృష్టికి సమస్యలు తీసుకువచ్చారు.

అదేవిధంగా యువతకు క్రికెట్ గ్రౌండ్, పేద ప్రజల శుభకార్యాల కోసం మల్టిపర్పస్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ల్యాండ్ కేటాయించాలని కోరుతూ ఎమ్మెల్యే వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్పందిస్తూ… సంబంధిత అధికారులతో వెంటనే ఫోన్ లో మాట్లాడారు. ఆయా అభివృద్ధి పనులకు నిధులు కేటాయించి, పనులు వేగంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రవీందర్ నాయక్, స్థానిక వార్డు అధ్యక్షుడు అమర్ సింగ్ నాయక్, హన్మంతు నాయక్, శివా నాయక్, కుమార్, ధర్మ పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement