Thursday, April 18, 2024

గ్రామీణాభివృద్ధికి అధిక నిధులు: పెద్దపల్లి ఎమ్మెల్యే

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు విడుదల చేస్తుందని పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పెద్దపల్లి మండలం లోని మూలసాలలో ఈజీఎస్ నిధులతో నిర్మించతలపెట్టిన సిసి రోడ్డు పనులను ఆయన ప్రారంభించారు.  అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం పెద్ద ఎత్తున నిధులు మంజూరు అవుతున్నాయని గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాల్లో సిసి రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement