Friday, April 19, 2024

ఇద్ద‌రు పిల్ల‌లు మిస్సింగ్… ఎక్క‌డంటే

6,7 త‌ర‌గతులు చ‌దువుతున్న ఇద్ద‌రు పిల్లలు మిస్సింగ్ అయిన ఘ‌ట‌న హైదరాబాద్ లోని బోరబండలో చోటుచేసుకుంది. ఇద్దరు విద్యార్ధులు కనిపించకుండా పోవ‌డంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. బోరబండలో 6,7 తరగతి చదువుతున్న ఇద్దరు అన్నాతమ్ముళ్లు ఆదృశ్యమైన సంఘటన ఎస్.ఆర్‌ నగర్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగింది.

ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. బోరబండ సైట్‌-3 లేబర్‌ అడ్డా ప్రాంతానికి చెందిన రాజు నాయక్‌ ఇద్దరు కుమారులైన గణేష్‌(10), రమేష్‌(12) లు స్థానిక పాఠశాలలో చదువుకుంటున్నారు. త‌ల్లిదండ్రులు మంగళవారం ఉదయం పనికి వెళ్ల‌గా… సాయంత్రం ఇంటికి వచ్చి చూసే సరికి పిల్లలిద్దరూ కనిపించలేదు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా పిల్ల‌లు క‌నిపించ‌లేదు. దీంతో త‌ల్లిదండ్రులు ఎస్.ఆర్‌.నగర్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆంజ‌నేయులు తెలిపారు. అయితే పిల్ల‌లు ఎక్క‌డికి వెళ్లార‌నేది తెలియాల్సి ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement