Saturday, April 20, 2024

నాలాలో మృతదేహం… 11 రోజుల తర్వాత లభ్యం

జీడిమెట్ల పరిధిలో గత 11 రోజుల కిందట నాలాలో కొట్టుకుపోయిన మోహన్ రెడ్డి అనే వ్యక్తి మృతదేహం ఐడీపీఎల్ కాలనీ నాలాలో లభ్యమైంది. మరణించి 11 రోజులు కావడంతో మృతదేహం కుళ్ళిపోయింది. వర్షానికి ప్రమాదవశాత్తు మోహన్‌రెడ్డి నాలాలో పడిపోయిన విషయం తెలిసిందే. మోహన్‌రెడ్డి మృతదేహం కోసం జీహెచ్‌ఎంసీ అధికారులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో మంళవారం ఐడీపీఎల్ కాలనీలోని నాలాలో మోహన్‌రెడ్డి మృతదేహం లభ్యమైంది. పోస్ట్‌మార్టం నిర్వహించి బాధిత కుటుంబానికి అందజేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement