Thursday, April 25, 2024

విడుదలైన మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర కేసు నిందితులు

తెలంగాణ రాష్ట్ర‌ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర కేసు నిందితులు ఈరోజు జైలు నుంచి విడుదలయ్యారు. ఈకేసులో ఏడుగురికి గురువారం మేడ్చల్ కోర్టు బెయిల్ ఇచ్చింది. మన్నూరు రవి, అమరేందర్ రాజు, రాఘవేందర్ రాజు, నాగరాజు, యాదయ్య, విశ్వనాథ్, మధుసూదన్ రాజు చర్లపల్లి జైలు నుంచి ఈఉదయం రిలీజ్ అయ్యారు. మంత్రి హత్య కుట్ర కేసులో మార్చిలో అరెస్ట్ అయిన ఏడుగురు 34రోజుల పాటు జైలులో ఉన్నారు. చేయని తప్పుకు తమను జైలుకు పంపారని నిందితులు వాపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement