Thursday, April 18, 2024

ఈత కొట్టిన మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం గౌరీదేవి పల్లి, కందూరు గ్రామంలో 4 కోట్ల 38 లక్షల రూపాయల తో నిర్మించిన చెక్ డ్యామ్ ను స్థానిక ఎమ్మెల్యే శ్రీ అల వెంకటేశ్వర రెడ్డి గారితో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే అల వెంకటేశ్వర రెడ్డి గార్లు చెక్ డ్యామ్ లో సరదాగా ఈత కొట్టి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. 

గౌరీదేవిపల్లి గ్రామంలో రూ. 5 కోట్ల వ్యయంతో నిర్మించిన చెక్ డ్యాం నిండి అలుగుపోస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి శ్రీనివాస్ గౌడ్, దేవరకద్ర ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డిని అప్పుడే అక్కడ ఈత కొడుతున్న చిన్నారులు నీళ్లలోకి దూకమని పిలిచారు. చిన్నారుల కోరిక మేరకో లేక బాల్యం గుర్తుకువచ్చిందో తెలియదు కానీ మంత్రి, ఎమ్మెల్యే ఒకరి వెంట ఒకరు చెక్ డ్యాంలోకి దూకారు. కొద్ది సేపు సరదాగా ఈత తమ ఆనందాన్ని పంచుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement