Wednesday, April 24, 2024

మహబూబాబాద్ లో పర్యటించిన.. మంత్రి సత్యవతి రాథోడ్

మంత్రి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్ లో పర్యటించారు. సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా పట్టణంలోని పలు ప్రాంతాలను మంత్రి పరిశీలించారు. కాగా ఆమె వెంట ఎమ్మెల్యే శంకర్ నాయక్, జడ్పీ చైర్మన్ బిందు, ఎస్పీ శరత్ చంద్ర పవర్ , మున్సిపల్ చైర్మన్ డాక్టర్‌ రామ్మోహన్ రెడ్డి, టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి నుకల నరేష్ రెడ్డి తదితరులు పట్టణంలో నూతన మెడికల్ కళాశాల, జిల్లా కలెక్టర్ నూతన కార్యాలయం, బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించారు.

మెడికల్ కళాశాల వద్ద జరుగుతున్న పనులను, కళాశాలకు వెళ్లే నూతన రోడ్డు పనులను పరిశీలించి ఆర్‌ అండ్‌ బీ అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మెయిన్ రోడ్డులో పాత విద్యుత్ స్తంభాలను మార్చాలని, విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. పట్టణంలోని అన్ని రోడ్లను సుందరికరించాలని, పారిశుద్ధ్య పనులు చేపట్టాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. వీరి వెంట , టీఆర్ఎస్‌ నాయకులు, ఆర్‌ అండ్‌ బీ, మున్సిపల్, విద్యుత్ అధికారులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement