Thursday, March 28, 2024

యాదాద్రికి 12 తులాల బంగారం.. విరాళం ఇచ్చిన మంత్రి సత్యవతి

తెలంగాణ గిరిజన,  స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆదివారం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. బాలలయంలో వేద పబడితుల మంత్రోచ్ఛారలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సిబ్బంది స్వామి వారి లడ్డు ప్రసాదాన్ని అందజేశారు.

స్వర్ణ తాపడం కోసం తన ఒంటిపై ఉన్న 12 తులాల బంగారు ఆభరణాలను మంత్రి విరాళంగా ఇచ్చారు. యాదాద్రి ఆలయం అద్భుత కట్టడమని మంత్రి సత్యవతి అన్నారు. కలలో కూడా ఊహించని విధంగా నిర్మాణం చేశారన్నారు.  ప్రజలగుండెల్లో సీఎం కేసీఆర్ చిరస్థాయిగా నిలుస్తారన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement