Thursday, March 28, 2024

సివిల్స్ కు ఎంపికైన డాక్టర్ శ్రీజకు మంత్రి సబితా అభినందనలు

తెలంగాణ రాష్ట్రం నుండి సివిల్స్ కు ఎంపికైన డాక్టర్ శ్రీజను రాష్ట్ర‌ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అభినందించారు.
సివిల్ సర్వీసెస్ కు ఎంపికై త్వరలో శిక్షణకు వెళ్లనున్న ఆమె ఈరోజు బషీర్ బాగ్ లోని కార్యాలయంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీజను మంత్రి అభినందించి, భవిష్యత్తులో మరింత రాణించాలన్నారు. శిక్షణలో మంచి ప్రతిభ చూపి, తల్లిదండ్రులకు, చదువు చెప్పిన గురువులకు, పుట్టిన గడ్డ పేరు నిలబెట్టాలన్నారు.

దేశంలోనే 20వ ర్యాంక్ సాధించటం ఎంతో గొప్ప విషయమని, యువతరానికి శ్రీజ విజయం ప్రేరణ ఇస్తుందని మంత్రి సబితా రెడ్డి అభిప్రాయపడ్డారు. ఉస్మానియా ఆస్పత్రిలో డాక్టర్ గా ప్రజలకు సేవలందిస్తూనే, దేశంలో అత్యున్నత సివిల్ సర్వీసెస్ కు ఎంపికైన డాక్టర్ శ్రీజ నగరంలోని ఉప్పల్ చిలుకనగర్ లో నివాసముంటున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement