Saturday, April 20, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2656 ఖాళీల భర్తీ: మంత్రి పువ్వాడ

రాష్ట్రంలో వివిధ ప్రభుత్వశాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగుల నియామకాను తక్షణమే నోటిఫికేషన్ జారీ చేసి ఉద్యోగాలను భర్తీ చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఅర్ అసెంబ్లీలో ప్రకటించడం పట్ల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2656 ఖాళీల భర్తీ చేయడంతో ప్రజా సేవలు మరింత మెరుగు పడనున్నయని మంత్రి అన్నారు. ఖమ్మం జిల్లా-1340, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 1316 మొత్తం 2656 ఖాళీలు పూర్తి చేయడంతో నిరుద్యోగుల పట్ల మంత్రి కేసీఅర్ కి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement