Thursday, April 25, 2024

లోయలో బస్సు దుర్ఘటనపై మంత్రి దిగ్భ్రాంతి

పెద్దపల్లి జిల్లా మంథని సమీపంలో లోయ‌లో ప‌డిన బ‌స్సు దుర్ఘ‌ట‌న‌పై రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బ‌స్సు ప్రమాద‌వ‌శాత్తు లోయ‌లో ప‌డ‌టం దుర‌దృష్టక‌ర‌మ‌ని మంత్రి విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడినవారికి మెరుగైన వైద్య సేవ‌లు అందేలా త‌గిన చ‌ర్యలు తీసుకోవాల‌ని క‌రీంన‌గ‌ర్‌, వ‌రంగ‌ల్ రీజినల్ మేనేజర్లను ఆదేశించారు. గాయపడినవారు త్వర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు. కాగా, బెల్లంప‌ల్లి నుంచి హ‌న్మకొండకు వెళ్తున్న పరకాల డిపో బస్సు.. మంథని మండలంలోని గాడిదులగండిగుట్ట వద్ద కారును ఢీకొట్టి రోడ్డుపక్కన లోయలో పడింది. ఈ ఘటనలో ఒకరు మరణించగా, 11 మంది గాయపడ్డారు.

ఇది కూడా చదవండి: అమరావతికి వెయ్యి కోట్లు వస్తాయా?

Advertisement

తాజా వార్తలు

Advertisement