Friday, April 19, 2024

వరిని కొంటారా.. కొనరా..?: మంత్రి పువ్వాడ ధర్నా

ధాన్యం కొనుగోలు చేయాలంటూ ఖమ్మంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద టీఆర్ఎస్ పార్టీ ధర్నా నిర్వహించింది. వడ్లు కొనాలని డిమాండ్ చేస్తూ రైతులకు మద్దతుగా టి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామ నాగేశ్వర్ రావు, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. కేంద్రం తీరుకు నిరసనగా మంత్రి పువ్వాడ, ఎంపీ నామా, మాజీ ఎంపీ పొంగులేటి ఎడ్లబండిపై ధర్నా చౌక్ వచ్చారు. తెలంగాణ రైతులు పండించిన వడ్లు కొనాలి అంటూ వరి నారుతో నినాదాలు చేశారు. యాసంగి వరిని కొంటారా .. కొనరా..? అంటూ నినాదాలు చేశారు. ఈ ధర్నాలో పెద్ద ఎత్తున రైతులు, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement