Friday, March 29, 2024

ఇస్కాన్ టెంపుల్ ను దర్శించుకున్న.. మంత్రి మల్లారెడ్డి

మేడ్చల్ (ప్రభన్యూస్): మండలంలోని డబిల్ పూర్ గ్రామ సమీపంలో గల ఇస్కాన్ టెంపుల్ ను రాష్ట్ర కార్మిక ఉపాధి హామీ శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆదివారం ఆలయ నిర్వాహకులు మంత్రి మల్లారెడ్డికి ప్రత్యేక స్వాగతం పలికి శాలువాతో ఘనంగా సన్మానించారు.అనంతరం శ్రీ మహా సుదర్శన నరసింహ హోమంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొని పూజలు చేపట్టారు.ఆలయంలో పూజలు నిర్వహించిన తర్వాత మంత్రి ఆలయం ముందు ఖాళీ ప్రదేశంలో మొక్కలు నాటి నీళ్లు పోశారు.

ఈ కార్యక్రమంలో డబిల్ పూర్ గ్రామ సర్పంచ్ వీర్లపల్లి గీత భాగ్యరెడ్డి.ఎంపీపీ వీర్లపల్లి రజిత రాజ మల్లారెడ్డి.జెడ్పిటిసి అమ్మగారి శైలజ విజయేందర్ రెడ్డి.రాష్ట్ర సర్పంచ్ ల ఫోరం ఉపాధ్యక్షులు శ్రీరంగవరం గ్రామ సర్పంచ్ అమ్మగారి విజేందర్ రెడ్డి.మేడ్చల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాసురాది భాస్కర్ యాదవ్. బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ సర్పంచ్ మద్దుల శ్రీనివాస్ రెడ్డి.వీర్లపల్లి రాజ మల్లారెడ్డి. వీర్లపల్లి భాగ్యరెడ్డి.తలారి అశోక్ ముదిరాజ్.మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చీర్ల దయానంద్ యాదవ్ నాయకులు మెరుగు మోహన్ రెడ్డి.బత్తుల మధుకర్ యాదవ్.రామోదర్ రెడ్డి. తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement