Friday, April 19, 2024

కాలినడకన తిరుమ‌ల‌కు బయల్దేరిన‌ మంత్రి మల్లారెడ్డి

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతి నుండి తిరుమలకు కాలినడక బయల్దేరారు రాష్ట కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి. బుధవారం నగరం నుండి బయ‌ల్దేరి తిరుపతి చేరుకున్నారు. అక్కడి నుండి కాలిబాటన తిరుమల చేరుకోనున్నారు. గురువారం వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని, ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, కరోనా బారినుండి రాష్ట్ర ప్రజలను కాపాడాలని దేవుని కోరతానని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement