Friday, March 29, 2024

కలెక్టరేట్ లో కేక్ కట్ చేసిన.. మంత్రి మల్లారెడ్డి

ప్రభ న్యూస్ ప్రతినిధి.. మేడ్చల్ : నూతన సంవత్సరంలో 2023 లో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని, జిల్లాను అన్ని రంగాల్లో ముందుంచాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ లోని మంత్రి ఛాంబర్ లో మంత్రి మలారెడ్డి నూతన సంవత్సరం కేక్ ను కట్ చేశారు. అనంతరం జిల్లా అధికారులు, సిబ్బంది మంత్రి మల్లారెడ్డికి, జిల్లా కలెక్టర్ లను శాలువాలు కప్పి సత్కరించారు.

పుష్ప గుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ, నూతన సంవత్సరంలో జిల్లాను అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో ఉంచాల్సిన బాధ్యత అధికారులందరిపైనా ఉందన్నారు. ఈ విషయంలో తన సహాయ, సహకారాలు పూర్తి స్థాయిలో ఉంటాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరీశ్ తో పాటు అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, అభిషేక్ అగస్త్య, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, ఆర్డీవో రవి, తహశీల్దార్లు, కలెక్టరేట్ ఏవో వెంకటేశ్వర్లు, ఆయా శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement