Thursday, April 25, 2024

కేటీఆర్ ను ఫిదా చేసిన స్వరం.. మెదక్ జిల్లా ఆణిముత్యం

ఓ యువ గాయ‌ని పాడిన పాటకు మంత్రి కేటీఆర్‌ను ఫిదా అయ్యారు. ఆమె స్వ‌రం అద్భుత‌మంటూ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. అద్భుత‌మైన గాయ‌ని అని మెచ్చుకున్నారు.

మెద‌క్ జిల్లాలోని నారైంగి గ్రామంలో శ్రావ‌ణి అనే అమ్మాయి అద్భుతంగా పాటలు పాడుతోంది. తన స్వ‌రం మైమ‌రిపించేలా ఉంది. ‘’రేలా రే రేలా రే నీళ్ల‌ల్లో నిప్ప‌లే వ‌చ్చింది నిజ‌మ‌ల్లే.. ప‌డిలేచి నిలిచే ర‌ణ‌ములో నా తెలంగాణ’’ అనే పాట‌ను శ్రావ‌ణి ఆల‌పించ‌గా..  ఈ వీడియోను సరేంద్ర తిప్ప‌రాజు అనే ఓ నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేసి మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేశారు. ఆమె ట్యాలెంట్‌కు మీ స‌హ‌కారంతో పాటు మీ ఆశీస్సులు అవ‌స‌ర‌మ‌ని కోరాడు. ఈ ట్వీట్‌పై స్పందించిన కేటీఆర్… శ్రావ‌ణిలో అద్భుత‌మైన ట్యాలెంట్ ఉందని ప్ర‌శంసించారు. మ్యూజిక్ డైరెక్ట‌ర్లు థ‌మ‌న్, దేవీ శ్రీప్ర‌సాద్‌కు కేటీఆర్ ట్యాగ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement