Thursday, April 25, 2024

మహా చండీ యాగంలో పాల్గొన్న మంత్రి కొప్పుల

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని శ్రీశ్రీ జయదుర్గదేవి ఆలయ 9వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో మహా చండీయాగం ఘనంగా నిర్వహించారు. బుధవారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన మహా చండీ యాగంలో రాష్ట్ర సంక్షేమం శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, స్నేహలత దంపతులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయంలో సందడి నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement