Thursday, April 25, 2024

యాదాద్రి కలెక్టర్ భవనాన్ని ప్రారంభించనున్న సీఎం: మంత్రి జగదీష్

ఈ నెల 12న యాదాద్రి భువనగిరికి సీఎం కేసీఆర్ రానున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. సోమవారం రాయగిరిలో నూతన కలెక్టర్ భవనాన్ని పరిశీలించారు. కలెక్టర్ భవనం, టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయం 12న ప్రారంభించి అనంతరం సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విఫ్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్ రెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి, ఎమ్మెల్యేలు ఫైళ్ల శేఖర్ రెడ్డి, గాధరి కిషోర్, చిరుమర్తి లింగయ్య, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, తెరాస జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement