Friday, April 19, 2024

కస్తూర్భా పాఠశాల పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి హరీశ్ రావు

దుబ్బాక : సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మండల కేంద్రమైన రాయపోల్ లో కస్తూర్భా గాంధీ పాఠశాల నిర్మాణ పనులకు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు శంకుస్థాపన చేశారు.. ఈ మేరకు కస్తూర్భా పాఠశాల విద్యార్థినీలతో మంత్రి కొద్దిసేపు ముచ్చటించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థినీలకు హైజీనిక్ కిట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందని ఆరోగ్య మంత్రి హరీశ్ రావు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement