Friday, April 19, 2024

మెడికల్ కాలేజీ నిర్మాణానికి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన

మహబూబాబాదు జిల్లా ప్రధాన ఆసుపత్రి నూతన భవనానికి, రు. 510 కోట్లతో నిర్మించబోతున్న మెడికల్ కాలేజీకి ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. అంతకుముందు జిల్లా ప్రధాన ఆసుపత్రిలో రేడియాలజీ సేవల భవనం, 41 పడకల జనరల్ వార్డ్, డెడికేటెడ్ పీడియాట్రిక్ కేర్ యూనిట్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, పెద్ది సుదర్శన్ రెడ్డి, tsmsidc చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement