Wednesday, April 24, 2024

ఒక్క ఇల్లు కట్టని ఈటల.. అభివృద్ది చేస్తాడా?: హరీష్

హుజురాబాద్ లో ఒక్క డ‌బుల్ బెడ్రూం ఇల్లు కట్టని ఈటల రాజేందర్‌కు ఓటు వేస్తే ఎలా అభివృద్ది చేస్తాడని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. అభివృద్ది కావాలంటే గెల్లు శ్రీనివాస్‌కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. హుజూరాబాద్ పట్టణంలోని రంగనాయకుల గుట్ట వద్ద పాటిమిది ఆంజనేయ స్వామి, జ్ఞాన సరస్వతి దేవాలయంలో మంత్రి హ‌రీష్ రావు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. అనంత‌రం పెద్ద‌మ్మ గుడికి నిర్మాణానికి మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్, టీఆర్ఎస్ అభ్య‌ర్థి గెల్లు శ్రీనివాస్ యాద‌వ్‌తో క‌లిసి మంత్రి హ‌రీశ్‌రావు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దమ్మ గుడి నిర్మాణానికి శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉంద‌న్నారు. వచ్చే ఆరు నెలల్లో గుడి పూర్తి చేసుకొని బోనాలు సమర్పించుకుంటామ‌ని తెలిపారు. ఇక్కడ ఇన్ని దేవాలయాలు ఉన్న రోడ్డు ఉండకపోవడం సరైంది కాదు. చిలుక వాగు బ్రిడ్జి కోసం కోటి రూపాయలు మంజూరు చేశామ‌ని మంత్రి తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. రూ.30 లక్షలతో ఈ దేవాలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామ‌ని హామీ ఇచ్చారు.

గతం ఉన్న మంత్రి ఒక్క డబుల్ బెడ్ రూం కూడా కట్టలేదని అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఅర్ నాలుగు వేల ఇండ్లు ఇచ్చారని గుర్తు చేశారు. స్థలం ఉన్న వారికి డబ్బులు ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. ఒక్క ఇల్లు కట్టని ఈటల రాజేందర్ కు ఓటు వేస్తే ఎలా అభివృద్ది చేస్తాడని హరీష్ రావు ప్రశ్నించారు. అభివృద్ది కావాలంటే గెల్లు శ్రీనివాస్ కు ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. బీజేపీ నిత్యావసర ధరలు పెంచి పేద ప్రజల మీద భారం వేస్తుందని మండిపడ్డారు. ప్రతి నెల గ్యాస్ ధర పెంచి సబ్సిడీ తగ్గిస్తుందని తెలిపారు. ధరలు పెంచే బీజేపీ కావాలా పేద ప్రజలను ఆదుకునే టీఆర్ఎస్ కావాలా ఆలోచించాల‌ని సూచించారు. ఇంకా రెండేళ్లు టీఆరెఎస్ అధికారంలో ఉంటుందన్నారు. కరోనా సమయంలో పేద ప్రజలను అదుకున్నామని చెప్పారు. పని చేసే వాళ్ళను ఆదరించాలని ప్రజలను మంత్రి హరీష్ రావు కోరారు.

ఇది కూడా చదవండి: అడగాల్సింది ఎవర్ని?: మోహన్ బాబుకు నాగబాబు కౌంటర్

Advertisement

తాజా వార్తలు

Advertisement